Friday, 12 June 2026 12:28:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

క్రీడల్లో రాణించేందుకు అంధత్వం అడ్డుకాదు!

- జెసిఐ అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి

Date : 07 July 2025 10:27 PM Views : 604

Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి, జులై 7: క్రీడల్లో రాణించేందుకు అంధత్వం అడ్డుకాదని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ - ఇండియా అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తుమ్మలగుంట కెవిఎస్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీల ప్రారంభం సందర్భంగా ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆయన మాట్లాడుతూ అంధులు అనేక రంగాలతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఏపీ డేవిడ్ జాన్, భారత జాతీయ అంధ క్రికెట్ జట్టు కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులు అన్ని విధాలా సమర్థులని తెలిపారు. సరైన మార్గదర్శనం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణి స్తారని చెప్పారు. క్రీడలు శక్తిని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. ఈ కారణంగా అంధులకు ప్రత్యేక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్ర నుండి ఆరు జిల్లాల జట్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ చైర్మన్ శేష సాయి, గట్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, దివ్యంగ సేవా క్షేత్రం ప్రెసిడెంట్ ముని లక్ష్మి క్రీడాకారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :