Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి, జులై 7: క్రీడల్లో రాణించేందుకు అంధత్వం అడ్డుకాదని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ - ఇండియా అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తుమ్మలగుంట కెవిఎస్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీల ప్రారంభం సందర్భంగా ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆయన మాట్లాడుతూ అంధులు అనేక రంగాలతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఏపీ డేవిడ్ జాన్, భారత జాతీయ అంధ క్రికెట్ జట్టు కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులు అన్ని విధాలా సమర్థులని తెలిపారు. సరైన మార్గదర్శనం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణి స్తారని చెప్పారు. క్రీడలు శక్తిని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. ఈ కారణంగా అంధులకు ప్రత్యేక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్ర నుండి ఆరు జిల్లాల జట్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ చైర్మన్ శేష సాయి, గట్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, దివ్యంగ సేవా క్షేత్రం ప్రెసిడెంట్ ముని లక్ష్మి క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
Famous TV