Famous TV - జాతీయ వార్తలు / : నేడు గాంధీ జయంతి సందర్బంగా తిరుపతి శిల్పారామంలో స్వతంత్ర సమరయోధుల స్మారకంగా నివాళి గోడ నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా గార్లతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేసిన సమరయోధుల గురించి వారు చేసిన పోరాటాలు గురించి భావి తరాలకు తెలిసే విధంగా వారి చిత్రం తోపాటుగా ఏర్పాటు చేయబడిన క్యూఆర్ కోడ్ ద్వార వారి వివరాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయనున్నారని పర్యాటక శాఖా మంత్రి రోజా గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని అన్నారు. నిత్యం సుమారు లక్ష మంది పైగా సందర్శించే తిరుపతి నగరంలో ఇలాంటి "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం వలన స్వాతంత్ర్య సమరయోధుల గూర్చి ఎక్కువ మంది తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ట్రిబ్యూట్కృ వాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న రోజా గారికి అలాగే ఈ వాల్ నిర్మించేందుకు ముందుకొచ్చిన చక్రా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసారు.
Admin
Famous TV