Friday, 12 June 2026 01:42:02 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

అధ్యయనంలో భాగంగా విదేశీ పర్యటనలో ఉరుగ్వే చేరుకొన్న పార్లమెంటరీ కమిటీ

రెండు దేశాల మధ్య వ్యాపార, స్నేహ సంబంధాలు దృఢ పరచడమే ప్రధాన ఉద్దేశం - ఎంపీ గురుమూర్తి.

Date : 17 June 2023 03:49 PM Views : 369

Famous TV - జాతీయ వార్తలు / : వారం రోజుల క్రితం వివిద అంశాలపై అధ్యయనానికి 10 మంది బృందంతో బ్రెజిల్ వెళ్లిన పార్లమెంటరీ కమిటీ అట్నుంచి అటు ఉరుగ్వే చేరుకొన్నారు. ఈ సందర్బంగా పార్లమెంటరీ కమిటీకి ఉరుగ్వేలో ఘనస్వాగతం లభించింది. అనంతరం జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు పెంపొందించే దిశగా చర్చలు సాగాయాని తెలియజేసారు. యుఎన్ఓ లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఈ చర్చలలో ఆ దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, స్పీకర్ మరియు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారని ప్రభుత్వం తరపున తమ ప్రతిపాదనలను స్వాగతించారని ఈ ఏడాది నవంబర్లో ఉరుగ్వే పార్లమెంట్ ప్రతినిధులు భారత్ లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలియజేసారు. అలాగే ఉరుగ్వేలో వ్యాపార అవకాశాలకి సంబదించి జరిగిన సమావేశంలో ఉరుగ్వేలో పెట్టుబడుల వలన ఎలాంటి ఉపయోగాలుంటాయి, రాబడి ఎలా ఉంటుంది అని పలు అంశాలపై వివరించారని చెప్పారు. భారతదేశంలో పెరుగుతున్న ఫర్నిచర్ ఇండస్ట్రీ డిమాండ్ కి అనుగుణంగా కొయ్య (వుడ్) ఎగుమతి చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసారని తెలియజేసారు.

ఉరుగ్వే ముప్పై లక్షల జనాభా కలిగిన దేశమని ఆ దేశ ప్రజలు కాని రాజకీయ నాయకులు కాని దేశ అధ్యక్ష హోదాలో ఉన్న వారు కాని ప్రతి ఒక్కరూ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని చాలా ప్రశాంతమైన దేశమని క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉందని అక్ష్యరాస్యత 97%గా ఉందని అన్నారు. ఉరుగ్వేలో అతిపెద్ద సంస్థ మన దేశానికీ చెందిన టీసీఎస్ కావడం మనకి గర్వకారణం అన్నారు. అక్కడ టీసీఎస్ లో పని చేస్తున్న ఉద్యోగులలో తెలుగు వారు ఉన్నారని వారందరిని కలుసుకోవడం సంతోషాదాయకమన్నారు. మొత్తం మీద తమ పర్యటన విజయవంతం అయ్యిందని తెలియజేశారు. ఈ పర్యటనకు ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డికి, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అలాగే ఈ కమిటీకి నేత్రుత్వం వహించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి తిరుపతి ఎంపీ గురుమూర్తి తన కృతజ్ఞతలు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :