Friday, 12 June 2026 01:41:14 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఎంపీ కలిసి పులికాట్ ముఖద్వారం గూర్చి కోరిన వెంటనే కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ

Date : 29 May 2023 06:36 PM Views : 502

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీలో ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగరమాల కార్యక్రమం కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో "తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద పులికాట్ సరస్సులోకి సముద్ర ముఖద్వారం తెరవడం" గూర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన వివరణాత్మక ప్రాజెక్ట్ (డిపిఆర్) పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.

పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు సరస్సు చుట్టూ నివసించే పేద మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధిని మెరుగు పరచి వారి జీవితాలలో వెలుగులు నింపెందుకు వీలైనంత త్వరగా పరిపాలనా అనుమతిని జారీ చేయమని వారిని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం సిఎస్ఎస్ కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 50:50 భాగస్వామ్య నిష్పత్తిలో చేయాలన్న కేంద్ర ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్‌ను ఆమోదించిన సంగతి ఆయనకి గుర్తు చేశారు.

ఇందుకు సమాధానంగా సదరు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పనులు మూడు శాఖల పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. నేడు మత్స్యశాఖ అనుమతి కోసం పంపగా మత్స్యశాఖ అనుమతి లభించిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపనున్నామని అన్ని అనుమతులు లభించిన పిదప టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని ఆయన చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :