Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీలో ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగరమాల కార్యక్రమం కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో "తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద పులికాట్ సరస్సులోకి సముద్ర ముఖద్వారం తెరవడం" గూర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన వివరణాత్మక ప్రాజెక్ట్ (డిపిఆర్) పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు సరస్సు చుట్టూ నివసించే పేద మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధిని మెరుగు పరచి వారి జీవితాలలో వెలుగులు నింపెందుకు వీలైనంత త్వరగా పరిపాలనా అనుమతిని జారీ చేయమని వారిని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం సిఎస్ఎస్ కింద రూ.128.80 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 50:50 భాగస్వామ్య నిష్పత్తిలో చేయాలన్న కేంద్ర ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ను ఆమోదించిన సంగతి ఆయనకి గుర్తు చేశారు.
ఇందుకు సమాధానంగా సదరు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పనులు మూడు శాఖల పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. నేడు మత్స్యశాఖ అనుమతి కోసం పంపగా మత్స్యశాఖ అనుమతి లభించిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపనున్నామని అన్ని అనుమతులు లభించిన పిదప టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని ఆయన చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.
Admin
Famous TV