Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ :: చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ భాగ్యవతిహరినాథ్ తమ గ్రామం పేరును డిల్లీస్థాయిలో తీసుకొని వెళ్ళడం చాలా గొప్ప విషయం.జలశక్తి మిషన్ ద్వారా వాటర్ షెడ్డు పథకంలో భాగంగా మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీ నందు జరిగిన కార్యక్రమాలు సవ్యంగా జరిగి జలశక్తి మిషన్ ను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని, గ్రామపంచాయతీ ని ప్రథమపథం లో నడిపించినందుకు గాను కేంద్రప్రభుత్వం కొన్ని ఆదర్శగ్రామపంచాయతీలను ఎంపిక చేసింది అందులో భాగంగా చిత్తూరు జిల్లా నుండి రెండు గ్రామపంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది. అందులో ఒకటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతనియోజకవర్గం కాగా రెండవది మాజీమంత్రి, ప్రస్తుత పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి నియోజక వర్గం చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీ కావడం విశేషం. అంటే గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీ వాటర్ షెడ్డు, జలశక్తి మిషన్ ద్వారా పరిపూర్ణత పొంది, సదరు అవకాశాలను సద్వినియోగం చేసుకుని, అభివృద్ది బాటలో ముందుకునడిచిన సందర్బంగా ఆగష్టు 15 దేశరాజధాని న్యూడిల్లీ లో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు ఆహ్వానం రావడం, అక్కడ ఉత్తమ అవార్డు ను, ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది.ఈ ప్రశంసా పత్రం అందుకోవడం సందర్బంగా చౌడేపల్లి మండల వైకాపా పార్టి సర్పంచ్ డిల్లీస్థాయిలో అవార్డు తీసుకోవడంతో బుదవారం గడ్డంవారిపల్లి సర్పంచ్ భాగ్యవతిహరినాథ్ లకు సన్మన కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామపంచాయతీ సర్పంచ్ నేడు డిల్లీ స్థాయిలో మండలం పేరును తీసుకొని వెళ్ళడం చాలా గొప్ప విషయం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి,ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకట్రమణ, వైసై యం. పి. పి సుధాకర్ రెడ్డి, మాజీ యం. పీ. పి రుక్మిణమ్మ, రెడ్డెప్ప రెడ్డి, సర్పంచులు కృష్ణారెడ్డి, షంషీర్ భాషా, రఘురామిరెడ్డి,యం. పి. టి.సి తొండా శ్రీరాములు, నాయకులు పరికిదొన బాబు,ఓబులేశు, పవన్, మంజునాథ్, వెంకటరెడ్డి, అల్తాఫ్, అనీష్, రెడ్డిబాబు, శెట్టిపేట శంకర, కృష్ణప్ప, మోహన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV