Famous TV - జాతీయ వార్తలు / : రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు ఆరాటపడుతున్నారు. అదే సంయంలో కొందరు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. వినియోగదారులకు విద్యుత్ శాఖ గొప్ప అవకాశం అంటూ ఓ పోస్టు వైరల్గా మారింది.రూ.2 వేల నోట్ల చలామణిపై ఆర్బీఐ శుక్రవారం(మే19) సంచలన ప్రకటన చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 30 తర్వాత రూ. 2 వేల నోట్లు చిత్తు కాగితాలతో సమానమనే చెప్పాలి. 2016 నవంబర్లో రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకురాగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే వాటి ముద్రణను నిలిపేసింది. దాదాపు నాలుగేళ్లుగా వాటిని ముద్రించటం లేదు.
Admin
Famous TV