Famous TV - జాతీయ వార్తలు / : నేడు ఢిల్లీలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ.కిషోర్ కె. బాసాని ని కలిసిన గురుమూర్తి తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత హైదరాబాద్ లోని ఆర్కియాలజీ సర్కిల్ కూడా హైదరాబాద్ సర్కిల్ మరియు అమరావతి సర్కిల్లుగా విభజించబడిందని ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి పని చేయడం ప్రారంభించిందని అమరావతి, చంద్రగిరి మరియు నాగార్జునకొండలో 135 స్మారక చిహ్నాలు/స్థలాలు మరియు మూడు సైట్ మ్యూజియంలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాచీన వారసత్వ సంపదను సూచిస్తాయని ఆయనకి వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిందని, ఇందులో 9 జిల్లాలు రాయలసీమ పరిధిలోకి వస్తాయని మరియు 17 జిల్లాలు కోస్తా ప్రాంతంలోకి వస్తాయని రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు జిల్లాతో సహా 70 స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, 13 ప్రధాన కోటలు, గుడిమల్లం, వీరభద్ర & బసవన్న (లేపాక్షి) వంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలం కొంతూరు సమీపంలో 11-12 శతాబ్దాల నాటి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏఎస్ఐ డిపార్ట్మెంట్ తవ్వగా, ఆంధ్రప్రదేశ్లోని లక్ష మాన్యుస్క్రిప్ట్లలో దాదాపు 55,000 మాన్యుస్క్రిప్ట్లు తిరుపతిలోని విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
భవిష్యత్తు తరానికి మన వారసత్వ సంపద అందించేందుకు స్మారక చిహ్నాలు, స్థలాలు మరియు మాన్యుస్క్రిప్ట్లకు మరింత ప్రాముఖ్యత ఇవ్వాలి. కావున, వీలైనంత త్వరగా తిరుపతిలో కొత్త పురావస్తు సర్కిల్ను రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పవలసిందిగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ. కిషోర్ కె. బాసాని కోరగా ఈ అంశం పరిశీలించి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.
Admin
Famous TV