Wednesday, 01 April 2026 06:14:10 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

తిరుపతి వేదికగా రాయలసీమ ఆర్కియాలజీ సర్కిల్ ఏర్పాటు చేయండి

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ.కిషోర్ కె. బాసాని ని కలిసిన గురుమూర్తి

Date : 29 May 2023 08:23 PM Views : 485

Famous TV - జాతీయ వార్తలు / : నేడు ఢిల్లీలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ.కిషోర్ కె. బాసాని ని కలిసిన గురుమూర్తి తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌గా విభజించిన తర్వాత హైదరాబాద్‌ లోని ఆర్కియాలజీ సర్కిల్ కూడా హైదరాబాద్ సర్కిల్ మరియు అమరావతి సర్కిల్‌లుగా విభజించబడిందని ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి పని చేయడం ప్రారంభించిందని అమరావతి, చంద్రగిరి మరియు నాగార్జునకొండలో 135 స్మారక చిహ్నాలు/స్థలాలు మరియు మూడు సైట్ మ్యూజియంలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాచీన వారసత్వ సంపదను సూచిస్తాయని ఆయనకి వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిందని, ఇందులో 9 జిల్లాలు రాయలసీమ పరిధిలోకి వస్తాయని మరియు 17 జిల్లాలు కోస్తా ప్రాంతంలోకి వస్తాయని రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు జిల్లాతో సహా 70 స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, 13 ప్రధాన కోటలు, గుడిమల్లం, వీరభద్ర & బసవన్న (లేపాక్షి) వంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలం కొంతూరు సమీపంలో 11-12 శతాబ్దాల నాటి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏఎస్‌ఐ డిపార్ట్‌మెంట్ తవ్వగా, ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష మాన్యుస్క్రిప్ట్‌లలో దాదాపు 55,000 మాన్యుస్క్రిప్ట్‌లు తిరుపతిలోని విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

భవిష్యత్తు తరానికి మన వారసత్వ సంపద అందించేందుకు స్మారక చిహ్నాలు, స్థలాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లకు మరింత ప్రాముఖ్యత ఇవ్వాలి. కావున, వీలైనంత త్వరగా తిరుపతిలో కొత్త పురావస్తు సర్కిల్‌ను రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పవలసిందిగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ. కిషోర్ కె. బాసాని కోరగా ఈ అంశం పరిశీలించి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :