Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం అనంత తేజోమూర్తిగా సూర్యప్రభ వాహనంపై గోవర్ధనగిరిదారుడి అలంకారంలో ప్రకాశించారు. ఉదయం 7.00 గంటల నుండి స్వామి వారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. సరిగ్గా 7.45 గంటల కు స్వామి వారిపై సూర్య కిరణాలు పడటంతో ఆలయ అర్చకులు హారతులు ఇవ్వగా భక్తుల గోవిందనామ స్మరణ చేశారు. వాహనసేవ ముందు అశ్వాలు, వృషభాలు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ దేవ దేవుని సూర్య ప్రభ ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి సూర్యునిపై అధిరోహించిన శ్రీవారిని కీర్తించారు.
Admin
Famous TV