Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట,13-02-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా రెండవరోజు 13-02-2024 (మంగళవారం)పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 8:00 గంటలకు వేద స్వస్తిగో పూజ, యంత్రార్చన ,ప్రధాన కుంభా వాహనలు, గణపతి అష్ట ద్రవ్య హవనము, ప్రతిష్టించబోయే సమస్త దేవతవిగ్రహాలకు పంచగవ్యము, క్షీరము, నదీ నదా, సముద్ర జలములతో గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి మరియు గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా పూజాభిషేకములు నిర్వహించారు. అలాగే సాయంత్రం 4:00గంటలకు మూషిక వాహనము, గరుడ వాహనము హనుమంత వాహనము, గంట, రథము మరియు శిలా గజములకు దాతల చేత పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు.సాయంత్రం 5:00 గంటల నుండి యాగశాల మండప అర్చకులు వివిధ దేవత హోమములు నిర్వహించిన తదుపరి తీర్థప్రసాదాలు వినియోగము చేసిన తరువాత అమరరాజా విద్యా సంస్థల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తాదులను అలరించాయి. భక్తాదులందరూ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ తన్మయత్వం చెందారు. ఇలా రెండవరోజు కార్యక్రమం ముగిసింది.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు,గూంటూరు (ఎం పి) గల్లా జయదేవ్ గారు , సర్పంచ్ గల్లా రాధాకృష్ణ , ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా సంపత్ నాయుడు, గల్లా దామోదర ప్రసాద్ ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Famous TV