Friday, 12 June 2026 01:41:14 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

అత్యంత వైభవోపేతంగా పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ - కుంభాభిషేక మహోత్సవ రెండవ రోజు పూజ కైంకర్యాలు, వేడుకలు:

Date : 13 February 2024 03:00 PM Views : 688

Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట,13-02-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా రెండవరోజు 13-02-2024 (మంగళవారం)పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 8:00 గంటలకు వేద స్వస్తిగో పూజ, యంత్రార్చన ,ప్రధాన కుంభా వాహనలు, గణపతి అష్ట ద్రవ్య హవనము, ప్రతిష్టించబోయే సమస్త దేవతవిగ్రహాలకు పంచగవ్యము, క్షీరము, నదీ నదా, సముద్ర జలములతో గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి మరియు గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా పూజాభిషేకములు నిర్వహించారు. అలాగే సాయంత్రం 4:00గంటలకు మూషిక వాహనము, గరుడ వాహనము హనుమంత వాహనము, గంట, రథము మరియు శిలా గజములకు దాతల చేత పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు.సాయంత్రం 5:00 గంటల నుండి యాగశాల మండప అర్చకులు వివిధ దేవత హోమములు నిర్వహించిన తదుపరి తీర్థప్రసాదాలు వినియోగము చేసిన తరువాత అమరరాజా విద్యా సంస్థల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తాదులను అలరించాయి. భక్తాదులందరూ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ తన్మయత్వం చెందారు. ఇలా రెండవరోజు కార్యక్రమం ముగిసింది.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు,గూంటూరు (ఎం పి) గల్లా జయదేవ్ గారు , సర్పంచ్ గల్లా రాధాకృష్ణ , ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా సంపత్ నాయుడు, గల్లా దామోదర ప్రసాద్ ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :