Famous TV - భక్తి / : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం అధికారులు స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వారిని శేషవస్త్రంతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్,మరియు వేద పండితులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV