Famous TV - భక్తి / చిత్తూరు : పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసియున్న శ్రీ కాళికాంబ సమేత శ్రీ సంతాన కాలభైరవ స్వామి ఆలయంలో ఆదివారం అష్టమి పూజలు వేడుకగా జరగనుంది. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ధర్మకర్తల కమిటీ కోరింది. ఈ ఆలయం పల్లవుల కాలం నాటి ప్రాచీనమైనది కావడం విశేషం. ఇక్కడ శ్రీ వాలీశ్వర స్వామి స్వయంభు లింగంగా వెలసి ఉన్నారు. ఇక్కడ శ్రీ మరగదాంబిగా అమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో నంది నోటి నుండి జలధార ఏడాది పొడవునా ప్రవహించడం మరో విశేషం. సంతానలేమితో బాధపడే వారు ఇక్కడి కాలభైరవని పూజిస్తే సంతానం కలుగుతుందన్నది ఈ ఆలయ ప్రత్యేకత. ఈ కారణంగా ఈ ఆలయంలో కొలువుదీరిన స్వామి సంతాన కాలభైరవ స్వామిగా ప్రసిద్ది. ఈ ఆలయంలో క్షేత్రపాలకునిగా కాలభైరవ స్వామి కొలువై ఉండడం గమనార్హం.
Admin
Famous TV