Famous TV - భక్తి / తిరుపతి : దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వేలవన్, ఐ.ఏ.ఎస్ గారు విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ దక్షిణ గోపురం వద్ద వారిని వారి కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తనయుడు ఆకర్ష రెడ్డి మరియు ఏఈఓ ధనపాల్ టెంపుల్ సూపరిండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ రెడ్డి, మరియు పట్టణ ప్రముఖులు వాడకల్లూరి మస్తాన్, కొల్లు హారిఘునాథ్ రెడ్డి మని,బాలగౌడ్, వేద పండితులు,దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV