Famous TV - భక్తి / తిరుపతి : నేటి నుంచి గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయం పొడిగించారు. గతంలో ఉదయం 06 గంటల నుండి సాయంత్రం 06 గంటల వరకు మాత్రమే దర్శన సమయం ఉండగా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా మరో మూడు గంటలు దర్శన సమయం పెంచి రాత్రి 09 గంటల వరకు దర్శన సమయం పొడిగించవలసినదిగా స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ ఆదర్వంలో నడిచే ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్లి ఆలయ దర్శన సమయం పెంచేందుకు కృషి చేశారు. ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా వాళ్ళు దీనికి సంబంధించి గతంలో జీవో విడుదల చేయగా నేటి నుంచి అమలులోకి వచ్చింది.
Admin
Famous TV