Friday, 12 June 2026 01:47:34 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఘనంగా పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు ప్రారంభం

Date : 12 February 2024 05:33 PM Views : 740

Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట, అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా 12-02-2024 (సోమవారం )పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 9 గంటలకు ప్రతిష్టించబోయే సమస్త దేవత విగ్రహములను పేటమిట్ట ,గణపతి రాపూర్ పోటు కనుమ ,కర్ణం వారి పల్లి మరియు కోట్లపల్లి గ్రామాల్లో ఘనంగా ఊరేగించారు.అలాగే ఉదయం 10 గంటలకు శ్రీమతి గల్లా అరుణ కుమారి ,శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గార్లు తమ స్వగృహం నుండి మంగళ వాయిద్యాలతో విరూపాక్షమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలను సమర్పించి, యాగశాలకు చేరుకుని గోపూజ, శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాంచన, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.సాయంత్రం నాలుగు గంటలకు శాలా వాహన , శోడశస్తంభార్చన, అఖండదీపార్చన, వాస్తు మండపారాధన, వాస్తు హోమము, వాస్తు పర్యగ్నికరణము, వాస్తు బలి ,క్షేత్రపాలక ,యోగిని ,నవగ్రహ మండపారాధన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.రాత్రి 8 గంటలకు తీర్థప్రసాదాలు స్వీకరించి ,పండరి భజన మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తాదుల రామనామ స్మరణతో మొదటిరోజు కార్యక్రమం ముగిసింది.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు,శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా రాధాకృష్ణ సర్పంచ్, ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా రాజగోపాల్ , గల్లా సంపత్ నాయుడు , ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :