Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : ఆన్లైన్ క్లాసుల ద్వారా సివిల్స్ మూడో అటెంప్ట్ లో సాధించిన జయశ్రీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం కూరుమాయి పోస్ట్ జరవారి పల్లి గ్రామానికి చెందిన మనెమ్మ, శ్రీరాములు రెడ్డి కుమార్తె జయశ్రీ ఆల్ ఇండియా సివిల్స్ నందు 360 ర్యాంకు సాధించి సత్తా చాటారు.ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణం క్లాక్ టవర్ వద్దకు జయశ్రీ చేరుకోగానే వారి కుటుంబీకులు బంధువులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపి స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం శ్రీసత్య గంగమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.తదుపరి పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ మోహన్ రెడ్డి, మరియు ఎస్ఐ స్వర్ణ తేజ సివిల్స్ ర్యాంకర్ జయశ్రీని దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ జయశ్రీ మాట్లాడుతూ జరావారి పల్లిలో జన్మించిన తాను పదవ తరగతి వరకు ఎలినా బెటినీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్ సాయి శ్రీ చైతన్య, బీటెక్ జేఎన్టీయూ పులివెందులలో చదివానన్నారు. సివిల్స్ కు ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రిపరేషన్ కావడం జరిగింది, మూడవసారి 360 ర్యాంకు సాధించడం చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సహకారం మరువలేనిదన్నారు.
Admin
Famous TV