Wednesday, 01 April 2026 04:43:42 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు

Date : 07 March 2026 06:46 PM Views : 386

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : ఆన్లైన్ క్లాసుల ద్వారా సివిల్స్ మూడో అటెంప్ట్ లో సాధించిన జయశ్రీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం కూరుమాయి పోస్ట్ జరవారి పల్లి గ్రామానికి చెందిన మనెమ్మ, శ్రీరాములు రెడ్డి కుమార్తె జయశ్రీ ఆల్ ఇండియా సివిల్స్ నందు 360 ర్యాంకు సాధించి సత్తా చాటారు.ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణం క్లాక్ టవర్ వద్దకు జయశ్రీ చేరుకోగానే వారి కుటుంబీకులు బంధువులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపి స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం శ్రీసత్య గంగమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.తదుపరి పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ మోహన్ రెడ్డి, మరియు ఎస్ఐ స్వర్ణ తేజ సివిల్స్ ర్యాంకర్ జయశ్రీని దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ జయశ్రీ మాట్లాడుతూ జరావారి పల్లిలో జన్మించిన తాను పదవ తరగతి వరకు ఎలినా బెటినీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్ సాయి శ్రీ చైతన్య, బీటెక్ జేఎన్టీయూ పులివెందులలో చదివానన్నారు. సివిల్స్ కు ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రిపరేషన్ కావడం జరిగింది, మూడవసారి 360 ర్యాంకు సాధించడం చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సహకారం మరువలేనిదన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :