Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : వ్యక్తిత్వ నిర్మాణం విజయానికి సోపానంగా మారుతుందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలంలోని ఆర్ సి ఆర్ బిజినెస్ స్కూల్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తి శక్తిగా మారాలంటే విద్యతో పాటు సానుకూల దృక్పథం, నిజాయితీ, విశ్వసనీయత, సామర్థ్యం, నైపుణ్యాలు అవసరం అన్నారు. విద్యార్థులు తమను తాము సమగ్రమైన వ్యక్తులుగా నిర్మాణం చేసుకోవాలని సూచించారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. మూడు రంగుల జండా ఎగురవేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆర్ శివప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఆశావాదం, కృషి పట్టుదల ఉన్నప్పుడు అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ వి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్, దూరదృష్టి, జట్టుకు ప్రేరణ కల్పించడం, సమన్వయ పరచడం లాంటి నైపుణ్యాలు ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంబిఎ విభాగాధిపతి వై నిరీష, ఎంసిఎ విభాగాధిపతి పి లలిత అధ్యాపకులు సతీష్, మురళి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ విద్యార్థులకు మెడల్స్,పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ లు ఇచ్చారు.
Reporter
Famous TV