Famous TV - విద్య ఉద్యోగాలు / : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పేడు మండలం పల్లం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనంద్ గారు తెలియజేశారు. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ వారు అందించిన పుస్తకాలన్నీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని, సాహితీ మరియు నైతిక విలువలకు బీజంవేసేవిదంగా వున్నాయని , విద్యార్థులకు విషయపరిజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన భాండాగారాలుగా ఉన్నాయని తెలియజేశారు. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ ఇచ్చిన ఈ పుస్తకాలను ప్రతిరోజు పిల్లలకి అందుబాటులో ఉంచి విద్యార్థులలో భాషా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి .ఆనంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె.వి బాబు, మెహర్ బాబు, సుబ్రమణ్యం, రెడ్డప్ప, పుష్పవాణి, వాణి మరియు ఉపాధ్యాయ మిత్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV