Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్వీ వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్య పై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది. ఈ వర్క్ షాప్ ను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ప్రారంభిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, వారి సూచనలతో వైద్య విద్యలో కలుగుతున్న కొత్త కొత్త మార్పులను, ఎప్పటికప్పుడు వైద్య అధ్యాపకులకు నిరంతరం వైద్య విద్య లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎస్ వి వైద్య కళాశాల చిన్నపిల్లల విభాగం లో శిక్షణ ఇవ్వడం జరిగినది. దీని ద్వారా వైద్య విద్యలో క్లినికల్, నాన్ క్లినికల్ లో టెక్నాలజీ మార్పులను వైద్య విద్య అభ్యసించే యూజీ, పీజీ, వైద్య విద్యార్థుల కొరకు, వైద్య అధ్యాపకులకు ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడంజరిగినది. ఎమర్జెన్సీ విభాగము మరియు తదితర విభాగము నందు వైద్య సదుపాయాలు గురించి, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. అందుకొరకు ఈ నిరంతర వైద్య విద్య శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించారని కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరీటి తెలిపారు. ఈ ఒక్కరోజు దాదాపు 30 మంది వైద్య అధ్యాపకులు శిక్షణ తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వసుంధర దేవి , విభాగాధిపతులు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Admin
Famous TV