Famous TV - విద్య ఉద్యోగాలు / : మంగళవారం విడుదల చేసిన ఎం సెట్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలలో మంగళ్ విద్యాలయ విద్యార్థుల విజయ కేతనం! 2024 ఎం సెట్ , అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలలో విద్యార్థులు అధిక మార్కులు సాధించి విద్యాలయ ఘనకీర్తిని చాటారు. ఎం సెట్ పరీక్షలో యమ్.మోహిత్ రెడ్డి 2575 ర్యాంకు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచాడు. తదుపరి బి.కార్తికేయ రెడ్డి 3404 ర్యాంకు ,బి.పణీంద్ర కుమార్ 3985 ర్యాంకు, యస్.హేమ ప్రియ 7171 ర్యాంకు, పి.ప్రీతి 7701 ర్యాంకు,పి.లహరి 7831 ర్యాంకు , ఎ వర్షిత 11173 ర్యాంకు, ఇ.హరిబాబు రెడ్డి 14488 ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ పరీక్షలో వి.లక్ష్మీ 3667 ర్యాంకు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది.తదుపరి యమ్.జాస్మిత 9584 ర్యాంకుతో రెండవ స్థానంలో నిలిచి పాఠశాల ఘన కీర్తిని చాటారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులను, తల్లిదండ్రులను,ఉపాధ్యాయ బృందాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు గారు అభినందించారు.
Admin
Famous TV