Wednesday, 01 April 2026 06:14:09 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

అరుదైన మూలకాలపై విస్తృత పరిశోధనలు సాగాలి

సెయింట్ పీటర్స్ వర్సిటీ ప్రొఫెసర్ గుణశేఖరన్

Date : 23 September 2023 06:15 PM Views : 422

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : అరుదైన మూలకాలపై యూనివర్సిటీ స్థాయిలో విస్తృత పరిశోధనలు సాగాలని చెన్నై లోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. గుణశేఖరన్ పేర్కొన్నారు. అరుదైన మూలకాలు అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం సెనేట్ హాల్లో శనివారం జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ గుణశేఖరన్ కీలకోపన్యాసం చేశారు. తేనె, పాలు, నెయ్యి వంటి ఆహార పదార్థాల్లో నాణ్యతను పరిశీలించడానికి ఉపయోగపడే విధానం అందుబాటులో ఉందన్నారు. ఆహార పదార్థాలను గుర్తించడం అవసరమని అన్నారు. లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. చెన్నైలోని ఇచ్చియాన్ కంటెంట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అధినేత డాక్టర్ జనని మాట్లాడుతూ.. మనుషులకు వచ్చే థైరాయిడ్ ను నివారించడానికి అవసరమైన మూలకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే, వాటిని వినియోగంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత ఈ తరం శాస్త్రవేత్తలపై ఉందని గుర్తు చేశారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎండి హుస్సేన్ మాట్లాడుతూ.. మూలకాలపై చేపట్టే పరిశోధనలకు స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఇలాంటి వర్క్ షాప్ వల్ల విద్యార్థులు, పరిశోధకులకు అవసరమైన అవగాహన కలుగుతుందని చెప్పారు. వర్సిటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు మాట్లాడుతూ.. రైతాంగానికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టాలని కోరారు. సభకు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కెటి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ వీ జే లక్ష్మణ్ 90 వ జయంతి సందర్భంగా వారికి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రెక్టార్ ప్రొఫెసర్ సీకే జయశంకర్, రేర్ ఎర్త్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ పీ రెడ్డి, వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. దేవి ప్రసాద్ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కమల శ్రీనివాసన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :