Famous TV - విద్య ఉద్యోగాలు / అనంతపురం : అనంతపురం .స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవ వేడుకకు అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. రంగజనార్ధన ముఖ్య అతిథిగా విచ్చేశారు.వారు తన స్నాతకోపన్యాసంలో ముందుగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ వారికి దిశ నిర్దేశం చేశారు.దేశ భవిష్యత్తు ఆర్థిక రంగంపై ఉంది యువత కేవలం సేవారంగంపై మొగ్గుచూపుక ఉత్పాదక రంగం వైపు అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు . చిన్న దేశాలైన తైవాన్ దక్షిణ కొరియా వంటివి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి అంటే ఆయా దేశాలు ఉత్పాదకరంగంలో సాధించిన అభివృద్ధే కారణం అని ఆయన అన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు శ్రీ జి.పుల్లయ్య గారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని తమ కళాశాల పెద్ద పెద్ద నగరంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు ధీటుగా ప్లేస్మెంట్స్ సాధిస్తూ విద్యార్థులకు ,తల్లిదండ్రులకు గట్టి భరోసా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన వైపు దృష్టి పెట్టినట్లయితే ఆ విద్యార్థి లేదా విద్యార్థిని జీవితంలో రాణిస్తారన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి మనదేశంలో కూడా రావాలని అభిలాషించారు .రానున్న రోజుల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని దీనికి మూల కారణం యువభారతమే అని అన్నారు . పట్టభద్రులైన ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు గర్వపడేలా, జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు .దేశం గుర్తించేలా ప్రవర్తించాలని సూచించారు .ఈ సందర్భంగా బ్రాంచీల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథి బంగారు పథకాలను ప్రధానం చేశారు .అనంతరం కళాశాల చైర్మన్ శ్రీ జి.వి.యం. మోహన్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 489 మంది విద్యార్థినీ విద్యార్థులుగ్రాడ్యుయేషన్ పట్టాలు పుచ్చుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై. పాండురంగయ్య,అడ్మన్ డీన్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ ,డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV