Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి, మే26: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలలో భారత స్థాయిలో 22వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు మొదటి ప్రయత్నంలోనే తిరుపతి జిల్లా వాసిగా డాక్టర్ పవన్ దత్త ఎంపిక కావడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆల్ ద బెస్ట్ అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి తల్లిదండ్రులు అభినందనీయులు అని కొనియాడారు. డాక్టర్ పవన్ దత్త తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థి అని తండ్రి రాజంపేట ఎల్ఐసి కార్యాలయంలో ఏఓ గా పనిచేస్తున్నారని, తల్లి లలిత కుమారి రైల్వేకోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Admin
Famous TV