Thursday, 11 June 2026 10:55:01 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం

Date : 18 July 2023 05:55 PM Views : 1520

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : స్థానిక బైరాగి పట్టెడలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఏ మురుగన్ గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు ముఖ్యఅతిథిగా విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ మురుగన్ గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజల కోసం ఎన్నో ఏండ్లు జైల్లో అనేక బాధలు అనుభవించి చివరకు దక్షిణాఫ్రికా అధ్యక్షు లు గా ఎన్నికయి వారి దేశ అభివృద్ధికి కృషిచేసి న గొప్ప వ్యక్తిని తెలియజేశారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని నమ్మి అదే బాటలో పైనుంచి దక్షిణాఫ్రికా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మండే సూర్యుడని, విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి పౌరులు ఎదగాలని తెలిపారు. వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వం గల మనిషిని, అనుకున్నది సాధించే వరకు పోరాడి వారి దేశ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చారని, వారి పడిన శ్రమ వృధా కాలేదని తెలియజేస్తూ విద్యార్థుల విద్యా రంగంలో ఇష్టంగా కష్టపడి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు. అంతకుముందు నెల్సన్ మండేలా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించి విజేతల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రెడ్డప్ప గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు, డాక్టర్ సి శ్రీరాములు గారు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :