Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీకాళహస్తి ఏప్రిల్ 27 పట్టణంలోని స్థానిక సరస్వతి భాయ్ మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో విద్యను అభ్యసించిన లక్ష్మీ ప్రియ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన సంగతి అందరికీ విధితమే. 600 మార్కులు గాను 596 మార్కులు సాధించి అటు తల్లిదండ్రులకు, విద్యను అభ్యసించిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ఇందుకుగాను శనివారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా సత్కారం అందుకుంది. స్వయంగా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినికి సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని అన్నారు. అప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.వో శేఖర్, ప్రధాన ఉపాధ్యాయులు బృందాదేవి, ఉపాధ్యాయులు గోపాల్ యాదవ్, వెంకటేశ్వర్లు, సురేష్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV