Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు తమ విధినిర్వహణ లో జవాబుదారీతనం,జవాబుదారీతనం ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేశారు.ఐతే ఈ మద్య వెలుగు సంఘాలలో,రైతుఉత్తత్తి దారుల సేవా సంఘాలలో నిధులు దుర్వినియోగం పై వ్కార్తాకథనాలు రావడం తో వార్తాకథనాలు రాసిన జర్నలిస్టు పై దాడి చేసిన సంఘటన నేపత్యం లో మొదటి సారి 14 మంది పైన,రెండవ సారి ఐదు మంది పైన యఫ్.ఐ.ఆర్ అయ్యింది.ఈ విషయమై వెలుగు రైతుఉత్పత్తి దారుల సంఘం లో సమాచార హక్కు చట్టం 2005 ద్వారా రికార్డుల వెరిఫికేషన్ కొరకు ధరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్బంగా సదరు కార్యాలయం అధికారులు రికార్డు పరిలీలనకు 24 వ తేది రమ్మని తెలియజేశారు.ఈ రోజు సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ అధ్యక్షురాలు ఉత్తరాది గీత,ఉత్తరాది హరిప్రసాద్ ల సమక్షం లో రికార్డుల తనిఖీ చేయడం జరిగింది.ఐతే వారు ఇచ్చిన సమాచారాని,రికార్డులకు చాలా వరకు తేడాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,అలాగే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన 17 అంశముల నివేదికను ఇవ్వలేదని,అసంపూర్తి సమాచారం ఇచ్చారని,మొదటి అప్పీళ్ళు చేశామని తెలిపారు.
Admin
Famous TV