Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామకృష్ణాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 185 మంది విద్యార్థులకు వివిధ రకములైన పుస్తకాల పంపిణీ పుస్తకం విశిష్టత విద్యా విశిష్టత పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పుస్తకం అమ్మలా లాలిస్తుందని నాన్నల ఆదుకుంటుందని ఒంటరితనంలో స్నేహితుల తోడు ఉంటుందని ఈరోజు కూడా రామాయణం ఖురాన్ బైబిల్ పుస్తకం రూపంలో ఉండడం పుస్తకం యొక్క గొప్పతనం అని పుస్తకం విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుందని అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు పాఠశాల హెచ్ఎం డి హుస్సేన్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు 185 మందికి వివిధ రకాలైన పుస్తకాలు ఇచ్చిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి హుస్సేన్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేశారు.
Admin
Famous TV