Friday, 12 June 2026 12:22:49 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రుయా ఆసుపత్రి లో చనిపోయిన తర్వాత నేత్రలు దానం చేయడానికి ముందుకొస్తున్న వారి కుటుంబ సభ్యులు.

Date : 21 March 2024 04:50 PM Views : 617

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : గురువారము ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి లో ఏ . దొరయ్ రాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధి తో చికిత్స పొందుతూ మరణించారు, చనిపోయిన ఏ . దొరయ్ రాజ్ సుమారు 60 సంవత్సరాలు , కొంగారెడ్డిపల్లి, సంబయ్యి కండ్రిగ, చిత్తూరు జిల్లా, ప్రాంతానికి చెందిన వ్యక్తి. రుయా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయన భార్య తన భర్త నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది. రుయా కంటి విభాగము విభాగాధిపతి డా చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది. నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి భార్య ఏ. ధన లక్ష్మి, సమ్మతితో ఆయన నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్ .రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది. తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు , ముందుకు రావడం జరుగుతున్నది, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నది, అని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాట్లాడుతూ. వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రింది ఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును, సెల్ నెంబర్: 8500880126, ఈ కార్యక్రమంలో ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్ .రమేష్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :