Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఓటు యొక్క విశిష్టత అంబేద్కర్ విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఓటు వజ్రాయుధంతో సమానమని ప్రతి ఒక్కరు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన నాయకున్ని వెన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు ఎన్నికల సంఘం వారు కూడా వృద్ధులకు వికలాంగులకు రోగస్తులకు ఓటింగ్ కోసం ప్రత్యేక అవకాశం కల్పించింది అన్నారు దేశంలో అక్కడక్కడ 20 శాతం మంది ఓటు హక్కులో పాల్గొనక పోవడం బాధాకరమని ఒక్క ఓటుతోనే విజయ అవకాశాలు తార్మారా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బ్రహ్మానంద చారి కోరారు అంబేద్కర్ ఆకాశంలో ధ్రువతారన్నారు ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనివాసులు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు సుధాకర్ గౌడ్ సహదేవుడు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం ఓటు హక్కు వినియోగిస్తామని బ్రహ్మానంద చారి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
Admin
Famous TV