Famous TV - సామాజిక సేవ / తిరుపతి : పేద విద్యార్థులకు సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ అనే కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయలు 150 మంది పిల్లలు విద్యార్థులకు ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతి నందు స్కాలర్షిప్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని ఒక గోల్ ఎంచుకుని దానికోసం కోసం కష్టపడి చదవాలని మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు లేవని నాకు ఇలాంటి సౌకర్యాలు ఉంటే ఎంతో మంది చదువుకునే వాళ్ళమని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితి లోకి రావాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు గారు మాట్లాడుతూ మేము చదువుకునే రోజుల్లో మాకు ఎలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మేము కూడా కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ఉన్నామని పది మందికి సహాయం చేయగలుగుతున్నామని అన్నారు.ప్రతి ఒక్క పిల్లవాడు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ కి గేమ్స్ అడిక్ట్ అవుతున్నారని అలా కాకుండా చదవడం రాయడం స్పష్టంగా నేర్చుకోవాలని, ఈరోజు సిర్డ్స్ సంస్థ ద్వారా 25 లక్షలు రూపాయలు 150 మంది పిల్లలు అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత అయినటువంటి కొండవీటి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఎదగాలని అన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో సిర్చ్ సంస్థ కార్యదర్శి మరుపూరి హేమశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ద్వారా బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం ద్వారా పేద పిల్లలందరినీ కూడా గుర్తించి వారికి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది అని అందులో భాగంగా ఈరోజు 150 మంది పిల్లలకు 25 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో సిర్డ్స్ సంస్థ డైరెక్టర్ స్వాతి,సిర్డ్స్ సంస్థ టీచర్స్, వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV