Thursday, 30 July 2026 07:23:53 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

లక్ష్యం దిశగా చదవండి

సిర్డ్స్ సంస్థ స్కాలషిప్ పంపిణీ కార్యక్రమం లో చంద్రగిరి ఎం. ఎల్. ఏ. పులివర్తి నాని పిలుపు

Date : 09 February 2025 03:58 PM Views : 1028

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : పేద విద్యార్థులకు సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ అనే కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయలు 150 మంది పిల్లలు విద్యార్థులకు ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతి నందు స్కాలర్షిప్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని ఒక గోల్ ఎంచుకుని దానికోసం కోసం కష్టపడి చదవాలని మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు లేవని నాకు ఇలాంటి సౌకర్యాలు ఉంటే ఎంతో మంది చదువుకునే వాళ్ళమని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితి లోకి రావాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు గారు మాట్లాడుతూ మేము చదువుకునే రోజుల్లో మాకు ఎలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మేము కూడా కష్టపడి చదువుకొని మంచి స్థాయిలో ఉన్నామని పది మందికి సహాయం చేయగలుగుతున్నామని అన్నారు.ప్రతి ఒక్క పిల్లవాడు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ కి గేమ్స్ అడిక్ట్ అవుతున్నారని అలా కాకుండా చదవడం రాయడం స్పష్టంగా నేర్చుకోవాలని, ఈరోజు సిర్డ్స్ సంస్థ ద్వారా 25 లక్షలు రూపాయలు 150 మంది పిల్లలు అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత అయినటువంటి కొండవీటి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఎదగాలని అన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో సిర్చ్ సంస్థ కార్యదర్శి మరుపూరి హేమశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ద్వారా బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం ద్వారా పేద పిల్లలందరినీ కూడా గుర్తించి వారికి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది అని అందులో భాగంగా ఈరోజు 150 మంది పిల్లలకు 25 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో సిర్డ్స్ సంస్థ డైరెక్టర్ స్వాతి,సిర్డ్స్ సంస్థ టీచర్స్, వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :