Famous TV - సామాజిక సేవ / తిరుపతి : నేడు స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీ లోని తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యాలయంనందు ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశము నందు ప్రస్తుత అధ్యక్షులు పి.గురివి రెడ్డి, కోశాధికారి ఎస్.బుచ్చి బాబు రాజీనామాలను సమర్పించి, వై.ఎస్.బాబుని అధ్యక్షులుగా, యు.ప్రసాదరావుని కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, సొసైటీ చైర్మన్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరి సి.ఆర్.కె. శేషగిరి రావు సమక్షంలో ఎన్నుకున్నారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారి రాబోవు కార్యక్రముగా నవంబర్ నెల 13వ తేదీన కార్తీక వనభోజనం, నవంబర్ 27వ తేదీన కార్తీక కోటి దీపోత్సవం, డిసెంబర్ లో 10,11వ తేదీలలో శ్రీ ఘంటసాల జయంతి ఉత్సవములు నిర్వహించాలని అధ్యక్ష కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ నిర్ణయించారు. కావున తిరుపతి ఫిల్మ్ సొసైటీ సభ్యులు, తిరుపతి పురప్రజలు పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. గమనిక: కోతగా చిరు సభ్యులు ₹300/- చెల్లించి సభ్యత్వ కార్డు పొంది పై కార్యక్రమాల యందు పాల్గొన ప్రార్థన.
Reporter
Famous TV