Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు మరియు బడిబాట విశిష్టత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై ర్యాలీ సదస్సు బుగ్గ రామేశ్వర భక్త మండలి సహకారంతో నిర్వహించడం జరిగినది మొదట ర్యాలీ చేసిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ బడిలో చేరితినే బాలలకు బంగారు భవిష్యత్తు అని కాబట్టి మీ పిల్లలు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు పేదరికం ఇతర కారణాలతో బాలలు పాల కార్మికులుగా మారుతున్నారని వీటిని నిర్మూలనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని బడిబాట విశిష్టత బాల కార్మిక నిర్మూలన గురించి వివరించారు. రామతీర్థం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ మా విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన బుగ్గ రామేశ్వర భజన మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మదన గోపాల్ సచివాలయం సిబ్బంది పాములేటయ్య, సునీల్ కుమార్, చంద్ర ,కళావతి, కుమార్, రామతీర్థం గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
Famous TV