Famous TV - సామాజిక సేవ / తిరుపతి : ఉపాధ్యాయులు నిరంతర విద్యారులు కావాలని సైకాలజిస్ట్ డా|| ఎన్ బి సుధాకర్ రెడ్డి సూచించారు. ఆదివారం రేణిగుంట లో జెసిఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో మురికి వాడల్లో పనిచేసే ఎస్ఐఆర్ఎస్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. కేవలం ఉన్న పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాన నవీకరణ చేసుకోవాలని చెప్పారు. జ్ఞానం, వికాసం, సహానుభూతి, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఓర్పు, సహనం, చైతన్యం, చురుకుదనం పెంచుకోవాలన్నారు. బోధన, పరిశోధన, కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడంలో మెలకువలు పాటించాలన్నారు. పిల్లలకు ప్రాథమిక సూత్రాలు నేర్పడం కీలకం అన్నారు. చదువులో తలెత్తే శారీరక, మానసిక అవరోధాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు ఆర్ శేష సాయి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపటున్నామని చెప్పారు. ఉపాధ్యక్షుడు రత్న శేఖర్ మాట్లాడుతూ టీచర్లు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో శ్రద్ధ చూపాలని కోరారు. ఎస్ఐఆర్ఎస్ అధ్యక్షుడు ఎం హేమశేఖర్ మాట్లాడుతూ మురికి వాడలలో ఉన్న పేద పిల్లలకు తమ సంస్థ ద్వారా ప్రత్యెక బోధన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Reporter
Famous TV