Thursday, 30 July 2026 08:21:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నీటిని పొదుపుగా వాడండి

Date : 12 April 2024 11:50 AM Views : 865

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె, ఏప్రిల్ 12 సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని ప్రస్తుత మారుతున్న పరిస్థితులలో నీటిని పొదుపుగా వాడాలని బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి తెలిపారు. శుక్రవారం పలుకూరు గ్రామంలోని రామాలయం నందు జెకేఆర్ సంక్షేమ సంఘం తరపున భక్తిదాయకమైన పుస్తకాల పంపిణీ మరియు నీటి యొక్క ప్రాధాన్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మానందాచారి మాట్లాడుతూ వర్షాలు తగ్గిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని దీంతో తీవ్ర నీటి ఎద్దడి పలు ప్రాంతాల్లో ఎదురవుతుందని తెలిపారు.ప్రస్తుతం వేసవికాలంలో అన్నిటి సమస్య జటిలంగా మారుతుందని అన్నారు.నీటి ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడాలని లేకుంటే రాబోయే కాలంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంగళూరు నగరం మరియు ఇతర ప్రాంతాలలో నీటి ఎద్దడి పరిస్థితులను వివరించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కాలం ప్రకారము రుతువుల ప్రకారము నడవడం లేదని గుర్తు చేశారు. దీంతో నీటి సమస్య పెరిగిపోతుందని అన్నారు.భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేయాలని,ప్రతి ఒక్కరూ 10 మొక్కలను పెంచి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కేఈ వెంకటసుబ్బయ్య గౌడు,బాల హనుమంతు,రాజు,శ్రీనివాసులు, సావిత్రి,రవణమ్మ,భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :