Famous TV - ఆరోగ్యము / తిరుపతి : జె సిఐ తిరుపతి ఒడిస్సీ చాప్టర్, ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో మేఘా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారం తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో వివిధ విభాగాలకు చెందిన 20 డాక్టర్లు వైద్య సేవలు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ పి సులోచన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ, ఫౌండేషన్ చైర్మన్ ప్రణీత్, జెసిఐ అంతర్జాతీయ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, జెసిఐ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యుడు జి ఎల్ మనోహర్ ప్రసంగించారు. జోన్ డైరెక్టర్ మణి సందీప్, తిరుపతి ఒడిస్సీ చాప్టర్ అధ్యక్షురాలు త్రిషల జె కామ్ చైర్ పర్సన్ లావణ్య, జోన్ ఆఫీసర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV