Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారము ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి లో ఈ రోజు అనస్థీషియా డిపార్ట్మెట్ నందు సి సి ఎల్ ఎస్ వర్క్ షాప్ జరిగినది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నప్పుడు వైద్యులుగా హాస్పిటల్ నందు ఎలాంటి సేవలు అందించాలి అనే దానిని గురించి వైద్యులకు అహ్మదాబాద్ చెందిన ఇంటర్నేషనల్ రిశసిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ నేషనల్ డైరెక్టర్ డా.రసిష్ దివాన్ గారు వైద్యులకు ట్రైనింగ్ నిర్వహించారు, ఆయనత తో పాటు స్విమ్స్ కు చెందిన డా.అలోక్ సమంత్ రాయ్, డా.హేమంత్,డా.సునీల్,ఎస్.వి మెడికల్ కాలేజ్ కి చెందిన డా. సూరి శెట్టి శ్రీనివాసరావు,గుంటూరు కు చెందిన డా.ప్రశాంతి ఆ ట్రైనింగ్ నందు ఫ్యాకల్టీ గా వున్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు,తిరుపతి,కుప్పం, అనంతపురము,కర్నూల్,కడప,చిత్తూరు కు చెందిన యాభై మంది వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్య క్రమాన్ని ప్రారంభిస్తూ ఎస్.వి.మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖరన్ రాష్ట్రంలో జరిగే మొట్ట మొదటి కార్యక్రమం తిరుపతి లో, అదీ ఎస్.వి మెడికల్ కాలేజీ లో జరగడం ఎంతో ఆనందంగా వుంది అంటూ దీనిని బాగా సద్వినియోగం చేసుకొని పోస్ట్ గ్రాడ్యు యెట్ వైద్య విద్యార్థులను ఆకస్మిక గుండెపోటును నివారించడానికి ఇలాంటి వర్క్షాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. తద్వారా సమాజంలో అకస్మాత్తుగా గుండెపోటు గురి అయ్యే వ్యక్తుల ప్రాణాలు కాపాడటం లో వైద్యులు పాత్ర ఎంతో విలువైనదని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
Admin
Famous TV