Thursday, 30 July 2026 10:34:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రపంచ ఆస్తమా దినం

Date : 07 May 2024 04:06 PM Views : 666

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మంగళవారము ఎస్ వి వైద్య కళాశాల మరియు అసోసియేషన్ ఆఫ్ పల్మోనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర ఆధ్వర్యంలో పల్మనరీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ వారు ప్రపంచ ఆస్తమా దినాన్ని నిర్వహించడం జరిగినది. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆస్తమాలో ఇటీవలి పురోగతిపై నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సుబ్బారావు ప్రొఫెసర్ అండ్ హెచ్వైడి మాట్లాడుతూ ఆస్తమా వల్ల ప్రజల్లో కలుగుతున్న ఆరోగ్యంలోని ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి రోగికి మెరుగైన వైద్యం అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు వైద్యులకు, పీజీ వైద్య విద్యార్థులకు అవసరమని అన్నారు. మెరుగైన వైద్యం పేదలకు అందించడంలో ఇలాంటి వర్క్ షాప్స్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ప్రేమానంద రాయ్, డాక్టర్ నరసింహన్, డాక్టర్ హితేసీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ రాయపూర్ రమేష్ బాబు , వైద్యులకు పీజీ వైద్య విద్యార్థులకు ఆస్తమా పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నూతనంగా వస్తున్న మార్పులను సులువైన పద్ధతిలో వైద్యం అందించడానికి కావలసిన తోడ్పాటును అందించడానికి వైద్యులకు, పీజీలకు అందుబాటులో ఉంటామని డాక్టర్ నరసింహ , డాక్టర్ ప్రేమానంద్ రాయ అన్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్. జి. రవి ప్రభు ఆర్గనైజింగ్ చైర్మన్: డా.కె. రాజేంద్ర కుమార్ APMC పరిశీలకుడు కో-ఛైర్మన్: డా. జి. రవీంద్ర బాబు వైద్యులు వైద్య విద్యార్థులు, పల్మనరీ మెడిసిన్ విభాగం, సిబ్బంది, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :