Famous TV - ఆరోగ్యము / : ప్రసూతి ఆసుపత్రి నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 01.08.2023 నుండి 07.08.2023 వరకు అవగాహన కార్యక్రమాలు జరుగుచున్నవి. అందులో భాగంగా(03) వ మూడవరోజు ప్రసూతి ఆసుపత్రి నందు నిర్వహించ బడినది . తల్లిపాల ముఖ్యత్వం గురించి ప్రసూతి వైద్యశాల చికిత్స నిమిత్తం వచ్చిన తల్లులందరికీ జన్మనిచ్చిన బిడ్డకు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం అందులోని ఔషధ గుణాలు గురించి తల్లులకు క్లుప్తంగా విశదీకరించినారు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. రుయా ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లులు బిడ్డలకు పాలిస్తున్నప్పుడు పరిసర ప్రాంతాల్లో శుభ్రత తీసుకోవాల్సిన చర్యలు వాటి గురించి తల్లులకువివరించారు. ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ గర్భవతులుగా ప్రసూతి ఆసుపత్రికి వచ్చి తల్లిగా వచ్చి ఆరోగ్యవంతమైన బిడ్డతో వెళ్లడం దేవుడిచ్చిన వరం లాంటిది , ఈ యొక్క జన్మనిచ్చిన తల్లులు పసిబిడ్డని కన్నుకు రెప్పలా కాపాడుకుంటూ వారి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, నిరంతరం కన్నబిడ్డకు పుట్టినప్పుడు నుండి చనుపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అదేలాగా ముఖ్యమని అన్నారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటే చనుపాలు బాగాఉత్పత్తి చెందుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి రోటరీ క్లబ్ వారు తల్లి బిడ్డకు, బ్రెడ్డు పాలు, బిస్కెట్స్ ఈ సందర్భంగా అందరి తల్లులకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగం డాక్టర్ తిరుపతిరెడ్డి, ప్రసూతి ఆసుపత్రి వైద్యులు యు జి పి జి వైద్య విద్యార్థులు, ప్రసూతి ఆసుపత్రి వైద్య సిబ్బంది , తిరుపతి రోటరీ క్లబ్ సభ్యులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV