Friday, 12 June 2026 12:21:06 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

కౌమార బాలికల వ్యక్తిగత పరిశుభ్రత’పై అవగాహనా సదస్సు

బాలికలకు 2 లక్షల రూపాయల విలువైన శానిటరీ నాప్కిన్స్ పంపిణీ

Date : 27 February 2024 10:31 PM Views : 678

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శ్రీసిటీ, ఫిబ్రవరి 27, 2024: బాలికలు రుతుక్రమం సమయంలో ఎదుర్కునే సమస్యలను పరిష్కరించడానికి ‘కౌమార బాలికల వ్యక్తిగత పరిశుభ్రత’ అనే అంశంపై సూళ్లూరుపేటలోని ఎపిఎస్‌డబ్ల్యు రెసిడెన్షియల్ స్కూల్‌లో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆరోగ్యం, పరిశుభ్రత ఉత్పత్తుల తయారీ అగ్రగామి పరిశ్రమ యూనిచార్మ్, శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీసిటీ ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీమతి నిరీషా సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాల బాలికలకు తగినంత అవగాహన లేకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు పరిశుభ్రత ఉత్పత్తులు సరిగ్గా అందుబాటులో లేకపోవడం కారణంగా పాఠశాలలకు బాలికల గైర్హాజరు, డ్రాపౌట్‌లకు దారితీస్తున్నాయని, ఆ సవాళ్లకు దారి చూపడమే ఈ సదస్సు ఉద్ద్యేశ్యం అన్నారు. సదస్సులో యునిచార్మ్ CSR వింగ్ నిపుణులు శ్రీమతి అంకిత మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఋతుక్రమణ పరిశుభ్రత పద్ధతులను గురించి వివరించడంతో పాటు విద్యార్థినులకు పలు విలువైన సూచనలు అందించారు. అలాగే కౌమారదశలో ఉన్న బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడంలో యూనిఛార్మ్ సంస్థ నిబద్ధతను స్పష్టం చేశారు. మన సంస్కృతి సేవా ట్రస్ట్‌కి చెందిన శ్రీమతి తేజోవతి కూడా సదస్సులో ప్రసంగించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించిన మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్. కె.హరినాధ రెడ్డి, దీనికి సహాయ సహకారాలు అందించిన యునిచార్మ్ మరియు శ్రీసిటీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సూళూరుపేటలోని APSW రెసిడెన్షియల్ స్కూల్, బిసి బాలికల హాస్టల్, తడలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) కు చెందిన 1100 మంది బాలికలకు Unicharm సంస్థ శానిటరీ నాప్‌కిన్ ప్యాక్‌లను పంపిణీ చేసింది. త్వరలో సత్యవేడు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇదే తరహా సదస్సు నిర్వహించి, శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. తద్వారా మరో 500 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం సుమారు 2 లక్షల రూపాయలు కంపెనీ ఖర్చు చేసింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :