Famous TV - తెలంగాణ / హైదరాబాద్ : పాపం ఖైదీలకు ఎంత కష్టం వచ్చింది. బయట నేరాలు చేసి దర్జాగా బ్రతికే వాళ్లు పోలీసులకు దొరికిపోయి జైలుకు వస్తున్నారు. జైళ్లలో కూడా గతంలో ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగానే ఉండేవి. కాని ఇప్పుడే జైలు అధికారులు సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే గతంలో జైళ్లలో ఖైధీల కు ఆహారంలో వారానికి ఒకరోజు మాంసం కూర వడ్డించేవారు. మటన్, చికెన్ను మోతాదులో ఇచ్చేవారు. కాని గత రెండు వారాలుగా తెలంగాణలోని ప్రధాన కారాగారాలైన చంచల్గూడ చర్లపల్లి జైలులో ఖైదీలకు మటన్, చికెన్ కర్రీ బంద్ చేశారు. ఖైదీలకు వడ్డించే మటన్ చికెన్ సరిపడ బడ్జెట్ రాకపోవడం..నిధుల కొరతతో నేరస్తుల కడుపు మాడుస్తున్నారని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జైళ్లకు మటన్ సప్లై చేసే కాంట్రాక్టర్కు బకాయి డబ్బులు కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో అతను మటన్, చికెన్ సప్లై నిలిపివేయడంతో ఖైదీలకు పప్పు, సాంబార్ భోజనంతో సరిపెడుతున్నారు జైల్ అధికారులు.
Admin
Famous TV